E-Paper
Advertisement

Rain forecast: కీలక హెచ్చరిక.. రేపటివరకు మీరు అక్కడికి వెళ్లొద్దు

Rain forecast: కీలక హెచ్చరిక.. రేపటివరకు మీరు అక్కడికి వెళ్లొద్దు
Advertisement

Rain forecast for AP, Telangana: వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నది.

బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెమాల్ తుఫాను ఉధృతంగా మారి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్నది. ఆ తీవ్ర తుఫాను అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశముందని.. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో భారీగా సుమారు 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెమాల్ తుఫాను ఉధృతంగా మారి తీవ్ర తుఫాను కొనసాగుతున్న క్రమంలో బెంగాల్ లోని తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్యం రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొన్నది. అదేవిధంగా ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

కాగా, నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలి ఉన్న భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి.

Also Read: నాకైతే నమ్మకం లేదు.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు

Advertisement

ఆదివారం వరకు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ తరువాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×