E-Paper
Advertisement

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy to meet Governor: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని బిల్లులను రూపొందించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నారు. ఈ అంశాలను చర్చించిన తర్వాత వీటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు. సీఎం వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం నుంచి కొంతమంది రైతులు సచివాలయానికి వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో రైతుల పేర్ల విషయంలో చాలా అవకతవకలు జరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కలిసి రైతులు సమస్యను వివరించారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×