BigTV English

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy to meet Governor: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని బిల్లులను రూపొందించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


అలాగే బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నారు. ఈ అంశాలను చర్చించిన తర్వాత వీటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు. సీఎం వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం నుంచి కొంతమంది రైతులు సచివాలయానికి వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో రైతుల పేర్ల విషయంలో చాలా అవకతవకలు జరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కలిసి రైతులు సమస్యను వివరించారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×