E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ..

CM Revanth Reddy Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ..

CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని మోదీని తొలిసారి కలవనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

విభజన చట్టంలోని పలు పెండింగ్ అంశాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా.. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు.. ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపు వంటి విషయాలపై చర్చించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలను కూడా కలవనున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించనున్నారు. ఇక తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణపై హై కమాండ్‌తో చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×