E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ..

CM Revanth Reddy Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ..
Advertisement

CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని మోదీని తొలిసారి కలవనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

విభజన చట్టంలోని పలు పెండింగ్ అంశాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా.. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు.. ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపు వంటి విషయాలపై చర్చించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలను కూడా కలవనున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించనున్నారు. ఇక తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణపై హై కమాండ్‌తో చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×