E-Paper
Advertisement

CM Revanth Reddy: చదువుల తల్లికి చేయూత.. గిరిజన యువతికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం

CM Revanth Reddy: చదువుల తల్లికి చేయూత.. గిరిజన యువతికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం
Advertisement

CM Revanth Reddy: ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది ఆ యువతి. కానీ, ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేదు. ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోన్న ఆ గిరిజన బాలికకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం అందించింది.

కుమురం భీం జిల్లాకు చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ డాక్టర్ కావాలన్నది కోరిక. నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించింది. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతోంది.

Advertisement

యువతికి డాక్టర్ కావాలనే కోరికైతే బలంగా ఉంది కానీ, ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. ఈ విషయం చివరకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యతను  ప్రభుత్వం తీసుకుంది. ఆర్ధిక సాయం అందజేసింది.

సాయిశ్రద్ధ, ఆమె తల్లిదండ్రులు బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సందర్భంగా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.  డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని రాసుకొచ్చారు.

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×