E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో మార్పు.. పూర్తి వివరాలివే!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో మార్పు.. పూర్తి వివరాలివే!
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగమైన ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. ఈనెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనుండగా, 15, 16 తేదీలలో ఢిల్లీలో సీఎం పర్యటన సాగుతుంది. 15న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 17వ తేదీన ఢిల్లీ నుండి సింగపూర్ కు సీఎం వెళ్ళనున్నారు. 17, 18 తేదీలలో సింగపూర్ లో పర్యటించి, 19న దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఈనెల 23వ తేదీ వరకు దావోస్ పర్యటన సాగుతుండగా, ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం పాల్గొంటారు. మళ్లీ ఈనెల 24వ తేదీన తిరిగి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకుంటారు.

Also Read: Chief Minister Revanth Reddy: మా టార్గెట్ అదే.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్

Advertisement

కాగా జనవరి 26వ తేదీన అమలు చేయాల్సిన రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పంపిణీ ఇతర కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలను నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందాలని, అలాగే రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులను పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచించారు. అలాగే ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం శుక్రవారం కాగా, ఆ భగవంతుడి కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×