E-Paper
Advertisement

Hyderabad News: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణ

Hyderabad News: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణ
Advertisement

Hyderabad News: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చరిత్రలో నిలిచిపోయేలా అనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ఆయా ఏర్పాట్లను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు? ఏ విధంగా ఉన్నాయి అనేది అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ స్థాయిలో తెలంగాణ సమ్మిత్ ఎప్పుడూ జరగలేదని అంటున్నారు కొందరు అధికారులు.

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు

Advertisement

అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డ్యాకుమెంట్ ఆవిష్కరణ నేపథ్యంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమిట్‌ కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాటు బాగుండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

శనివారం సాయంత్రం హెలికాప్టర్‌లో ఫ్యూచర్ సిటీకి వచ్చారు ముఖ్యమంత్రి. తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ప్రాంగణంలో వేదికలు, ఇతర నిర్మాణ పనులను దాదాపు గంటకు పైగానే పరిశీలించారు. పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మార్పులపై ఆయన పలు సూచనలు చేశారు.

Advertisement

స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి, పలుచోట్ల మార్పులు

సమిట్‌ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. వివిధ సమావేశాల వేదికలు, వాటిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కోసం ఏర్పాటు చేసిన తెరలు దగ్గరుండీ పరిశీలన చేశారు. సీటింగ్‌ ఏర్పాట్లపై సూచనలు చేశారు. మూసీ పునరుజ్జీవంపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ చిత్రాలను స్వయంగా వీక్షించారు.

వచ్చే అతిథుల కోసం సదుపాయాలు, ఇంటర్‌నెట్, వాహనాల రాకపోకలకు రహదారులు వివరాలు తెలుసుకున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ALSO READ: కేఫ్ నిలోఫర్ నుంచి టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ. 10 లక్షల విరాళం

రెండేళ్లలో రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు 2037-విజన్, 2047-విజన్‌‌కు సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలను ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వివరించనున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతున్నాయి. అయితే గ్లోబల్‌ సమిట్‌కు వస్తున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు సీఎం. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చర్చించారు.

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×