BigTV English

CM Revanth Reddy: గుర్తింపు ఎక్కడ.. సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి.. ప్రధానికి లేఖ?

CM Revanth Reddy: గుర్తింపు ఎక్కడ.. సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి.. ప్రధానికి లేఖ?

CM Revanth Reddy: ప‌ద్మ అవార్డులపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించు కున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రముఖుల పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని మనసులోని ఆవేదనను బయటపెట్టారు.


గ‌ద్ద‌ర్ (ప‌ద్మ‌విభూష‌ణ్‌), చుక్కా రామ‌య్య (ప‌ద్మ‌భూష‌ణ్‌), అందెశ్రీ (ప‌ద్మ‌భూష‌ణ్‌), గోర‌టి వెంక‌న్న (ప‌ద్మ‌శ్రీ‌), జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు (ప‌ద్మ‌శ్రీ‌) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్రప్రభుత్వం. మంత్రులు, అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ అంశంపై ముఖ్య‌మంత్రి రేవంత్ మాట్లాడారు.

తెలంగాణ‌కు ప‌ద్మ పుర‌స్కారాల్లో ముమ్మాటికీ అన్యాయమే జరిగిందన్నారు సీఎం. తెలంగాణ స‌మాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌లు అందించిన గ‌ద్ద‌ర్‌, చుక్కా రామ‌య్య‌, అందెశ్రీ‌, గోర‌టి వెంక‌న్నల‌ను గుర్తించ‌క‌పోవ‌డం దారుణమన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించడ‌మేన‌ని పేర్కొన్నారు.


139 మందికి పుర‌స్కారాలు ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం. తెలంగాణ‌కు క‌నీసం అయిదు పుర‌స్కారాలు ప్ర‌కటించ‌లేదు. తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే పద్మ అవార్డులు వచ్చాయి. వైద్య రంగంలో నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌, ప్రజా వ్యవహారాల్లో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.

ALSO READ:  గణతంత్ర దినోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం మాట

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×