E-Paper
Advertisement

Telangana Tourism: టూరిజం పాలసీని సిద్దం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

Telangana Tourism: టూరిజం పాలసీని సిద్దం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Telangana Tourism: హుస్సేన్ సాగర్ పరిసరాలలో గల అన్ని పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని టూరిజం శాఖ అధికారులు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం పర్యాటకశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై తీవ్ర చర్చ సాగింది.

సమీక్ష అనంతరం అధికారులతో సీఎం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 లోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. దేశ విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి, పాలసీని రూపొందించాలన్నారు. అలాగే విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా తెలంగాణ టూరిజం మరింత అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. ఎకో, టెంపుల్ టూరిజం పై ఎక్కువగా దృష్టి పెట్టాలని, సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.

Advertisement

జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలన్నారు. అదిలాబాద్ వరంగల్ నాగార్జునసాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలన్నారు.

Also Read: TTD News: ఆ ఛానెళ్లపై కేసు నమోదు.. లైసెన్స్ లను రద్దు చేయాలని టీటీడీ ఫిర్యాదు

Advertisement

వచ్చే గోదావరి, కృష్ణ పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. పర్యాటక అభివృద్ధి తో రాష్ట్రానికి మరింత గుర్తింపు వస్తుందని, అదే రీతిలో ఆదాయం కూడా వచ్చేలా టూరిజం పాలసీను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×