Big Stories

CM participated in Bio Asia 2024: హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా 2024 సదస్సు.. పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy participated in Bio Asia 2024:

- Advertisement -

CM Revanth Reddy participated in Bio Asia 2024: హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా 2024 సదస్సు ఫిబ్రవరి 27న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో జీవవైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పలపై చర్చించనున్నారు. రాష్ట్ర రాజధాని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిచిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -

కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించడంలో హైదరాబాద్‌ కూడా ఉండటం గర్వకారణం అన్నారు. మరెన్నో పరిశోధనలకు హైదరాబాద్‌ నిలయంగా ఉందన్నారు. ఫార్మా రంగంలో అభివృద్ధి కోసం ఇటీవల ఫార్మా రంగ ప్రతినిధులతో చర్చించామన్నారు. వారు కూడా ఫార్మారంగం అభివృద్ధికి బాసటగా నిలుస్తారని వివరించారు.

ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగెట్స్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పుటు, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఔషద పరికరాలు ప్రోత్సహకాలపై చర్చంచనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News