CM Revanth Reddy participated in Bio Asia 2024: హైదరాబాద్లో 21వ బయో ఆసియా 2024 సదస్సు ఫిబ్రవరి 27న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో జీవవైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పలపై చర్చించనున్నారు. రాష్ట్ర రాజధాని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ అందించడంలో హైదరాబాద్ కూడా ఉండటం గర్వకారణం అన్నారు. మరెన్నో పరిశోధనలకు హైదరాబాద్ నిలయంగా ఉందన్నారు. ఫార్మా రంగంలో అభివృద్ధి కోసం ఇటీవల ఫార్మా రంగ ప్రతినిధులతో చర్చించామన్నారు. వారు కూడా ఫార్మారంగం అభివృద్ధికి బాసటగా నిలుస్తారని వివరించారు.
ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగెట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పుటు, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఔషద పరికరాలు ప్రోత్సహకాలపై చర్చంచనున్నారు.