E-Paper
Advertisement

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి బిఆర్ఎస్సే, డీల్ మామూలుగా లేదుగా

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి బిఆర్ఎస్సే, డీల్ మామూలుగా లేదుగా
Advertisement

Jubilee Hills bypoll: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు వివిధ పార్టీల నేతలు. దీంతో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు తర్జనభర్జన పడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు తలోవిధంగా చర్చించుకోవడం మొదలైంది.

మైండ్ గేమ్ మొదలైందా?

Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 13న సోమవారం విడుదల కానుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతను ఎంపిక చేశాయి. బీజేపీ అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్ విడుదలకు సమయం ఉండడంతో రాజకీయ పార్టీల మధ్య మైండ్ గేమ్ మొదలైంది. గురువారం బీజేపీ నుంచి ఓ వార్త హంగామా చేసింది.

బొంతు రామ్మోహన్‌కు బీజేపీ టికెట్ ఇస్తే బాగుంటుందని ఓ ఎంపీ ప్రతిపాదన చేసినట్టు ప్రచారం సాగింది. ఈ విషయం తెలియగానే బొంతు రామ్మోహన్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామమోహన్‌రెడ్డి ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. బీఆర్ఎస్-బీజేపీ పార్టీల జెండాలతో కూడిన ఫోటో పెట్టి బైపోల్‌లో ఈ రెండు పార్టీలు ఒక్కటే అని అర్థం వచ్చేలా చేశారు.

Advertisement

రామమ్మోహన్ పోస్టుపై చర్చ

జూబ్లీ‌హిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి బిఆర్ఎస్సేనని రాసుకొచ్చారు. కారు గుర్తుకి ఓటు, కమల బలోపేతానికే.. దిక్కుతోచని స్థితిలో బీజేపీ కార్యకర్తలు, బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు అని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సునీత పేరు ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి ఎవరనేది తేలాల్చివుంది. ఈ లెక్కన రెండు పార్టీలు ఏమైనా ఒప్పందం జరిగిందా అంటూ చర్చించుకోవడం ఆయా పార్టీల కార్యకర్తల వంతైంది.

ALSO READ: హైదరాబాద్ శివారులో మొసలి హంగామా

పట్టభద్రుల, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీ పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ రేసు నుంచి బీజేపీ తప్పుకుంటుందా? అన్న చర్చ మొదలైంది. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలీదుగానీ, రామమోహన్‌రెడ్డి పోస్టుపై చిన్నపాటి చర్చ కార్యకర్తల్లో మొదలైంది. కొందరు నేతలు ఇదంతా మైండ్ గేమని అంటున్నారు. కార్యకర్తలను డైవర్ట్ చేసేందుకు ఈ ఎత్తుగడని అంటున్నారు.  రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×