Census Self Enumeration: జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి ఆన్లైన్లో స్వీయ గణన ప్రారంభమైంది. దీంతో వెబ్సైట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్ సీహెచ్. ప్రియాంకతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read: Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు
సెన్సెస్ ప్రక్రియ దశలవారీగా సాగనుంది. తొలుత ‘హౌస్ లిస్టింగ్’ చేపడతారు. ఇల్లు, గుడిసె, అపార్ట్మెంట్, విద్యాసంస్థలు ఇలా అన్నింటినీ గుర్తించి ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తారు. ఆ తర్వాతే వ్యక్తి గత సమాచార సేకరణ ఉంటుంది. స్వీయ నమోదు చేసుకున్న వారు తమకు వచ్చే ఐడీని ఎన్యూమరేటర్లకు అందజేస్తే, వారు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలకమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరాన్ని మొత్తం 21,866 ఎన్యూమరేషన్ బ్లాక్లుగా విభజించినట్లు తెలిపారు. నగరంలో విద్యావంతులు ఎక్కువ కాబట్టి, అధిక శాతం మంది ఆన్లైన్లో స్వీయ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రక్రియలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్, అదనపు అధికారులుగా సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు పర్యవేక్షించనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలంటే జనగణన విజయవంతం కావడం అవసరమని, ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.
జనగణన 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
ఆన్లైన్లో తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్న ముఖ్యమంత్రి
As part of the 2027 census, Chief Minister Revanth Reddy participated in the self-enumeration process and personally entered his details online. pic.twitter.com/rNKmyitbAB
— BIG TV Breaking News (@bigtvtelugu) April 26, 2026