E-Paper
Advertisement

డిజిట్ జనగణన షురూ.. ఆన్ లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

డిజిట్ జనగణన షురూ.. ఆన్ లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Census Self Enumeration: జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. దీంతో వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

సెల్ఫ్ ఎన్యుమరేషన్..

జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ సీహెచ్. ప్రియాంకతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also read: Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు

నమోదు విధానం ఇలా.. 

సెన్సెస్ ప్రక్రియ దశలవారీగా సాగనుంది. తొలుత ‘హౌస్‌ లిస్టింగ్‌’ చేపడతారు. ఇల్లు, గుడిసె, అపార్ట్‌మెంట్‌, విద్యాసంస్థలు ఇలా అన్నింటినీ గుర్తించి ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తారు. ఆ తర్వాతే వ్యక్తి గత సమాచార సేకరణ ఉంటుంది. స్వీయ నమోదు చేసుకున్న వారు తమకు వచ్చే ఐడీని ఎన్యూమరేటర్లకు అందజేస్తే, వారు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలకమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలు

హైదరాబాద్‌ నగరాన్ని మొత్తం 21,866 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించినట్లు తెలిపారు. నగరంలో విద్యావంతులు ఎక్కువ కాబట్టి, అధిక శాతం మంది ఆన్‌లైన్‌లో స్వీయ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రక్రియలో ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, అదనపు అధికారులుగా సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు పర్యవేక్షించనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలంటే జనగణన విజయవంతం కావడం అవసరమని, ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Also Read: Gundeninda GudiGantalu Weekly episode: ప్రభాకు మైండ్ బ్లాక్.. సత్యం కోసం బాలు కన్నీళ్లు.. రోహిణి గతం బయటపడిందా..?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×