E-Paper
Advertisement

World Economic Forum Summit : స్విట్జర్లాండ్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..

World Economic Forum Summit : స్విట్జర్లాండ్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
Advertisement

World Economic Forum Summit : స్విట్జర్లాండ్‌ వేదికగా జనవరిలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌ జరగనుంది. జనవరి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సమ్మిట్‌ జరుగుతుంది. ఈ సమ్మిట్‌కు సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతోపాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్పెషల్‌ సీఎస్‌ జయేశ్‌ రంజన్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లనున్నారు. ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మాత్రమే కాక పలు రాష్ట్రాల నుంచి సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు.

షెడ్యూల్‌ ప్రకారం అయితే.. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని టీమ్‌ జనవరి 15న ఎర్లీ మార్నింగ్‌ బయల్దేరి వెళ్తుంది. 18వ తేదీన తిరిగి హైదరాబాద్‌ చేరుకోనుంది. గతేడాది జరిగిన సమ్మిట్‌ కు అప్పటి మంత్రి కేటీఆర్‌ అండ్‌ టీం వెళ్లింది. దాదాపుగా 21వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పుకుంది.

Advertisement

విదేశీ కంపెనీలు తెలంగాణలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేలా సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, సర్వీస్‌ సెక్టార్లలో అనుసరిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితరాలను వివరించి రాష్ట్ర ఎకానమీకి దోహదపడడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రయత్నించనుంది.

దావోస్‌ సమ్మిట్‌కు ఎంచుకునే థీమ్‌, ఎజెండా అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవ్వనున్న రాయితీలు, కల్పించనున్న సౌకర్యాలను ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు. దాంతో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకునే అవకాశముంది.

Advertisement

.

.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×