Revanth Grandson: తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా.. అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు అంటూ సీఎం రేంత్ రెడ్డి ఈ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాకు ఇదో మదుర క్షణం అని సీఎం రేవంత్ అన్నారు.
Also read: బండి భగీరథ్కు బెయిల్.. కానీ హైకోర్టు పెట్టిన ఆ కఠినమైన షరతులు ఇవే!
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజా సమస్యలపై సమీక్షలు, సమావేశాలు, రాజకీయ సమీకరణాలతో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఓక్క క్షణం కూడా తీరిక లేకుండా నిరంతరం ప్రజలకోసం పని చేసే సీఎం రేవంత్ రెడ్డి తన హోదాను పక్కన పెట్టి తన మనవడితో ముచ్చటించాడు. అంతే కాకుండా మనవడి కోసం వంట గదిలో తన స్వహస్తాలతో సీఎం రేవంత్ రెడ్డి పూరీలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి తన మనవడంటే చాలా ఇష్ట్రం గతంలో కూడా తాత మనవడి అనుభందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన కాంగ్రెస్ శ్రేనులు సీఎం రేవంత్ రెడ్డి సింప్లిసిటి అని కొనియాడారు.
Also read: Extramarital Affairs: ఆ ఒక్క కారణంతోనే.. భర్తలను అతి దారుణంగా చంపేస్తున్న భార్యలు!
మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
‘‘"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు… బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ… pic.twitter.com/6UpARVU0es
— ChotaNews App (@ChotaNewsApp) July 9, 2026