E-Paper
Advertisement

Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. సర్ ప్రక్రియపై డెడ్ లైన్ పెట్టిన అధికారులు.. చివరి తేదీ..?

Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. సర్ ప్రక్రియపై డెడ్ లైన్ పెట్టిన అధికారులు.. చివరి తేదీ..?
Advertisement

Hyderabad SIR: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాలోని లోపాలను సరి చేయటంతో పాటు బోగస్ ఓట్ల ఏరివేతకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ చాలా నెమ్మెదిగా కొనసాగుతుంది. గత నెల 25వ తేదీన మొదలైన ఈ సర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 2వ తేదీ వరకు సుమారు 47 లక్షల 36 వేల మంది ఓటర్లందరికీ ఇంటింటికెళ్లి ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఫారం-6,7,8 లను పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆశించిన స్థాయిలో విధులు నిర్వర్తించకపోవటంతో ఇంకా ఇంటింటికి ఫారాల పంపిణీ ప్రక్రియ ముగియలేదు. ఇంటింటికి ఫారాలు పంపిణీ చేసేందుకు జాప్యం జరుగుతుండటంతో ఫారాల పంపిణీకి ఎన్నికల సంఘం ఈ నెల 7 వరకు గడువు పెంచాల్సి వచ్చింది.

ఈ నెల 11వ తేదీ వరకు..

ఆ తేదీ నాటికి కూడా ఫారాల పంపిణీ పూర్తి కాకపోవటంతో ఈ నెల 11వ తేదీ వరకు ఫారాల పంపిణీ ఖచ్చితంగా పూర్తి చేయాలని, 12 నుంచి కేవలం పూరించిన ఫారాలు మాత్రమే స్వీకరించి, ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల సంఘానికి అప్పగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో సిటీలోని ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఇంకా సగం శాతం మంది ఓటర్లకు ఫారాలు అందలేని పరిస్థితి నెలకొంది. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఫారాలను అందజేసినా, వాటిని ఎలా పూరించాలి, ఎలాంటి సమాచారమివ్వాలి, సర్ 2002 కు సంబంధించిన ఓటరు వివరాలు అందుబాటులో లేకుండా ఏం చేయాలన్న ఓటర్ల సందేహాలను నివృత్తి చేసే అధికారులు కరవయ్యారు.

గత నెల 25వ తేదీన..

Advertisement

ముషీరాబాద్ వంటి నియోజకవర్గంలో స్థానికంగా నివాసముండే బూత్ లెవెల్ ఆఫీసర్లు కొందరు ఓటర్లు తమ ఇంటికి వచ్చి ఫారాలు తీసుకెళ్లాలని, వాటిని పూరించిన తర్వాత మళ్లీ తమ ఇళ్లకు తీసుకువచ్చి ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ దృష్టికి రావటంతో ఆయన సర్ ప్రక్రియపై బుధవారం నుంచి ఆకస్మిక క్షేత్ర స్థాయి పర్యటనలు, ప్రక్రియ జరుగుతున్న తీరుపై తనిఖీలు మొదలు పెట్టారు. గత నెల 25వ తేదీన ప్రారంభమైన సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 14 రోజులు గడిచినా, ఇంకా ఫారాల పంపిణీ పూర్తి కాకపోవటంతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ బూత్ లెవెల్ ఆఫీసర్లపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read: CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

హెల్ప్ ‘లెస్’ డెస్క్‌లు..

Advertisement

ప్రతి ఓటరుకు ఇంటికెళ్లి ఎన్యుమరేషన్ ఫారంతో పాటు కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6, ఓటును తొలగించుకునేందుకు ఫారం-7 ను, ఒక నియోజకవర్గంలోని ఓటరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకునేందుకు ఫారం-8 ను పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవటంతో ఇప్పటి వరకు నూటికి నూరు శాతం ఇంటింటికి ఫారాలు అందలేదు.

15 నియోజకవర్గాల్లో..

ఈ క్రమంలో ఓటరుకు ఫారం పూరించటంలో సహకరించేందుకు 15 నియోజకవర్గాల్లో ఒక్కోక్కటి చొప్పున, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో హెల్ప్ డెస్క్ తో కలిపి మొత్తం 16 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. కానీ వీటి వల్ల ఓటర్లకు ఆశించినంత ప్రయోజనం సమకూరటం లేదని వీటిని సందర్శించిన కొందరు ఓటర్లు వాపోయారు. ఈ హెల్ప్ డెస్క్ లలో ఫారాలు అందుబాటులో లేకపోగా, మరికొన్నింటిలో సందేహాలను నివృత్తి చేసే స్థాయి అధికారి అందుబాటులో లేకపోవటంతో ఈ హెల్ప్ డెస్క్ లు ఓటర్లకు హెల్ప్ లెస్ డెస్క్ లుగా మారాయని ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also read: విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు డైరెక్ట్ ఫ్లైట్స్.. ఇండిగో బిగ్ సర్‌ప్రైజ్!

కీలకంగా మారనున్న బూత్ లెవెల్ ఏజెంట్లు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి కీలకమైన, బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండటం, అందుబాటులో లేకపోవటంతో ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, సర్ 2002 సమాచారం కోసం వివిధ పొలిటికల్ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ రకంగా నాలుగు ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎంఐఎం, కాంగ్రేస్, బీఆర్ఎస్ పార్టీలు సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 4062 పోలింగ్ స్టేషన్లకు 10 వేల 901 మంది ఏజెంట్లను నియమించారు.

నిబద్ధతతో విధులు..

ప్రధాన పార్టీల వద్ద దశాబ్దాల క్రితం నుంచి ఓటరు జాబితాలు అందుబాటులో ఉండటంతో సర్ 2002 సమాచారాన్ని ఓటర్లకు అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఓటర్ల ఫారాలు పూరించటంతో పాటు సర్ 2002 సమాచారాన్ని కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు పూరించి, ఓటరు ఫొటో డిక్లరేషన్ తో బూత్ లెవెల్ ఆఫీసర్ కు సమర్పిస్తున్నారు. ఓటు బ్యాంక్ ను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను చేపడుతున్నా, ఈ విధులను నిర్వర్తించాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు నిబద్ధతతో విధులు నిర్వర్తించకపోవటం వల్లే తాము బూత్ లెవెల్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నామని ఓటర్లు చెబుతున్నారు.

Also read: CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

Related News

Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

బండి భగీరథ్‌కు బెయిల్.. కానీ హైకోర్టు పెట్టిన ఆ కఠినమైన షరతులు ఇవే!

Extramarital Affairs: ఆ ఒక్క కారణంతోనే.. భర్తలను అతి దారుణంగా చంపేస్తున్న భార్యలు!

CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్!

తెలంగాణ ఆర్టీసీలో..1,500 కండక్టర్ జాబ్స్, టెన్త్ పాసైతే చాలు!

మెదక్‌లో సినిమా స్టైల్ కిడ్నాప్.. నాలుగు కార్లలో వచ్చి నవవధువును ఎత్తుకెళ్లిన బంధువులు!

Big Stories

Advertisement
×