E-Paper
Advertisement

CM Revanth Reddy : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగ్.. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగ్.. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy news today

CM Revanth Reddy news today(Political news in telangana):

సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు గాను.. మధ్యాహ్నం 12 గంటలకు హస్తినకు బయలుదేరతారు. CWC మీటింగ్ లో తర్వలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై చర్చించనున్నారు. అలాగే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్‌పై కూడా సమీక్షించనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో తెలంగాణలో పొత్తులతో వెళ్లాలా లేదంటే ఒంటరిగా బరిలో దిగాలా అన్నదానిపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో చర్చ జరగనుంది. ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా ఉన్నందున పొత్తులతో వెళ్తే ఆ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి? లేదంటే మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీనే పోటీ చేయాలా అన్నదానిపై సమావేశం అనంతరం క్లారిటీ రానుంది. ఇక ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారు.

మరోపక్క గురువారం జరగాల్సిన కలెక్టర్ల సమావేశం వాయిదాపడింది. భూ సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహలక్ష్మీతోపాటు పలు పథకాల అమలుపై కలెక్టర్ల సమీక్షలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంది ప్రభుత్వం. అయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగడం.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌తో ఈ భేటీ వాయిదా పడినట్టు తెలుస్తోంది.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×