E-Paper
Advertisement

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Advertisement

CM Revanth reddy visits YadagiriguttaCM Revanth Reddy Visits Yadagirigutta(Latest news in telangana): నేడు యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి యాదాద్రి వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక ఛాపర్‌లో సీఎం యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఇవాళ్టి నుంచి యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

ఆరుగురు మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడ రామయ్యను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తదనంతరం భద్రాచలం సీతారామ ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం మణుగూరులో నిర్వహిస్తున్న బహిరంగసభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×