BigTV English
Advertisement

CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం..

CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీ రామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఆయన పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతా రాముల కల్యాణోత్సవానికి హాజరైన సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన విషయం తెలిసిందే.


అక్కడి సన్న బియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. అలాగే సీఎం వెంట వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా అక్కడే సీఎంతో కలిసి భోజనం చేశారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ లో ఏర్పాటు చేసిన సభలో ఈ స్కీంను ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపిన విషయం విదితమే. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని ఆమె పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పారు. ధనవంతుల లాగే పేదవారు కూడా సన్నబియ్యం తినాలని కోరుతున్నారని చెప్పారు. గత ఏడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని చెప్పుకొచ్చారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని తెలిపారు.


ALSO READ: Bhadrachalam CM Revanth Reddy: భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు.. పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎం రేవంత్ రెడ్డి

Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×