BigTV English
Advertisement

CM Revanth Reddy: తెలంగాణకు ఆత్మ బంధువు మన్మోహన్ సింగ్‌.. భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణకు ఆత్మ బంధువు మన్మోహన్ సింగ్‌.. భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్

Manmohan Singh: ప్రపంచమే గర్వించ దగిన ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు ఆయనతో పోటీ పడేవారు లేరన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి.


మన్మోహన్ సింగ్ వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించారని తెలిపారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయనను పేర్కొన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ అందరికీ ఆర్థిక రూపశిల్పి మాత్రమే.. తెలంగాణకు మాత్రం ఆత్మబంధువని కొనియాడారు.

తెలంగాణకు రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప మానవతావాది మన్మోహన్ సింగ్ అని, తెలంగాణలో ఆయనకున్న బంధం విడదీయరానిదన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లోని ఓ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ విగ్రహావిష్కరణ చేయాలని సభ నిర్ణయించింది.


దీనిపై ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. తెలంగాణ గడ్డపై ఆయన విగ్రహం పెట్టాలనుకోవడం సముచితమైన నిర్ణయమని తెలిపారు. దీనికి సభ ద్వారా ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు.. భూసేకరణ చట్టం సవరణ చేసిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ALSO READ: బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా? వచ్చే నెలలో వెల్లడి..!

సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి మద్దతు తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామ న్నారు కేటీఆర్. ఈ పురస్కారానికి ఆయన పూర్తిగా అర్హులన్నారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో ఏడాదిన్నరపాటు మంత్రి కేసీఆర్ పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×