Gajwel Collector: పిల్లలు ఆహారం సరిపోయేంత తింటేనే శారీరకంగా దృఢంగా ఉంటారని చదువుతోపాటు ఆటలు సైతం ఆడేందుకు పిల్లలకు సమయం ఇవ్వాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ హైమావతి (Collector Haimavathi) సూచించారు. గజ్వేల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు.
విద్యార్థులకు కలెక్టర్ మాట్లాడి వారికి పలు మెలుకవల గురించి వివరించారు. పిల్లలకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. పిల్లలకు మరల అన్నం, కూరలు కావాలన్నప్పుడు వడ్డించే వారే వారి వద్దకు వెళ్లి వడ్డించాలని సూచించారు. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినాలని పిల్లలకు కలెక్టర్ సూచనలు చేశారు. కామన్ మెనూ పాటించాలని భోజనం తోపాటు నెయ్యిని వడ్డించాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకముందు వండిన అన్నం, కూరలను పరిశీలించారు.