Collector Haimavathi: స్వేచ్ఛ, బ్యూరో : రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూములను అప్పగించడానికి రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ హైమావతి (Collector Haimavathi) సూచించారు. గజ్వేల్ సమీకృత కార్యాలయంలో సోమవారం భూమి కోల్పోతున్న జగదేవ్ పూర్ మండలం చేబర్తి, అలిరాజిపేట్, పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో సమావేశమై భూసేకరణ వివరాల గురించి వివరించారు. త్రిబుల్ ఆర్ గజ్వేల్ నియోజకవర్గం లోని వివిధ మండలాల గ్రామాల గుండా వెళ్తున్న విషయాన్ని తెలిపారు.
Also Read: Viral News: మాజీ భార్య అక్క తిట్టిందని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన 4 పెళ్లిళ్ల మొగుడు
త్రిబుల్ ఆర్ వల్ల గజ్వేల్ నియోజకవర్గం మరింత అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని భూముల విలువలు పెరగడంతో పాటు వ్యాపార, రవాణా, పరిశ్రమల వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతుల త్యాగం గొప్పదని వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రావడం శుభ పరిణామం అని సదరు అయితే భూములకు ఆమోదయోగ్యమైన పరిహారం ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం రైతులు తమ అమూల్యమైన భూమిని అప్పగించడానికి సిద్ధమవుతున్న విషయాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించడానికి చర్యలు చేపడతానని రైతులు త్వరగా భూముల అప్పజెప్పడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, తాసిల్దార్ నిర్మల ఆయా గ్రామాల భూమిని కోల్పోతున్న రైతులు పాల్గొన్నారు.
Also Read: Ambati Rambabu: నవరత్నాలే కాదు, జగన్ కూడా ఫెయిల్యూర్.. అంబటి అంత మాట అనేశావేంటీ?