E-Paper
Advertisement

Collector Pratima Singh: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

Collector Pratima Singh: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
Advertisement

Collector Pratima Singh: స్వేచ్ఛ, బ్యూరో: ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతి మా సింగ్ వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాపన్నపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వైద్య స్క్రీనింగ్ శిబిరం – సమగ్ర నివేదిక గురించి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ. జిల్లాలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వైద్య స్క్రీనింగ్ జిల్లాలోని అన్ని PHCలు మరియు సబ్ సెంటర్లలో ఈ శిబిరాలు నిర్వహించబడినవని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 157 సబ్ సెంటర్లు మరియు 19 PHCలలో స్క్రీనింగ్ కార్యక్రమం జరగగాఈ శిబిరాలలో మొత్తం 1307 మంది హైపర్‌టెన్షన్ (బీపీ పరీక్ష) ,డయాబెటిస్ (రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్ష)క్యాన్సర్ స్క్రీనింగ్ (మౌఖిక మరియు స్తన క్యాన్సర్) హీమోగ్లోబిన్ పరీక్ష తదుపరి పరీక్షల కోసం 313రక్త నమూనాలు సేకరించబడిందన్నారు.

Also Read: APAAR ID Apply Online: అపార్ ఐడీతో అన్ని సర్టిఫికెట్లు ఒకేచోట.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ప్రయోజనాలు ఇవే

ప్రజలకు  ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యం

Advertisement

ఈ రక్త నమూనాలను టి-హబ్ నమూనా రవాణా వ్యవస్థ ద్వారా టి-డయాగ్నస్టిక్స్ ప్రయోగశాలలకు పంపబడినవని వివరించారు.. అక్కడ నిర్వహించే పరీక్షల CBP (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) HbA1C(లిపిడ్ ప్రొఫైల్)LFT (లివర్ ఫంక్షన్ టెస్టులు) RFT (రెనల్ ఫంక్షన్ టెస్టులు)అవసరమైన ఇతర ప్రయోగశాల పరీక్షలుస్క్రీనింగ్ సమయంలో గుర్తించిన అనుమానాస్పద కేసులను తదుపరి పరీక్షలు మరియు చికిత్స కోసం తగిన ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయడం జరిగిందన్నారు ప్రజలకు మెరుగైన సమర్థవంతమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. . ప్రజలు తమ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. వైద్య స్క్రీనింగ్ శిబిరం ద్వారా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో హరిప్రసాద్, , మెడికల్ ఆఫీసర్ అన్వర్, సిహెచ్ఓ చందర్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read: YS Jagan Mohan Reddy: బాబు హామీలన్నీ మోసాలే.. రెండేళ్లలోనే అప్పులు మూడు లక్షల కోట్లు దాటాయి: జగన్

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×