Balmuri Venkat: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సెప్టెంబర్ 2న సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ హయాంలో జరిగి అవకతవకలపై కేసు నమోదు చేసి.. సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అవకతవకలకు సంబంధించిన అంశాలను బహిరంగంగా ప్రస్తావించారని బల్మూరి వెంకట్ అన్నారు. ఈ ఆరోపణలు చాలా తీదొవ్రమైనవని బల్మూర్ వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత చేసిన ఆరోపణల వెనుక వాస్తవాలు ఉన్నాయని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. వాటిపై తక్షణమే విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను అభ్యర్థించారు.
ఈ ఆరోపణలు ప్రజల దృష్టిని ఆకర్షించాయని ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని బల్మూర్ వెంకట్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను సాక్ష్యాలుగా పరిగణించి.. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో.. పోలీసులు కవిత ఆరోపణల స్వభావం, వాటి పరిధిపై పరిశీలన జరిపి.. తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వ అవకతవకల అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ALSO READ: LIC Denies Allegations: అదానీ సంస్థల్లో పెట్టుబడులు.. ప్రభుత్వ ఒత్తిళ్లపై క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ