CPI vs Congress: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐకి పొత్తు కుదరలేదు. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. ఉపసంహరణ గడువు ముగియకుండానే (2వ తేది) పొత్తు పటాపంచలైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా అన్నింటిలో సీపీఐ పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా అన్నీ డివిజన్లలో సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కానీ సోమవారం నాడు ఉపసంహరించు కోవాలని సిపిఐ ఎవరినీ కోరడంలేదని సమాచారం. కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐ చెరి సగం డిమాండ్ చేయగా.. కాంగ్రెస్ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐ కొత్తగూడెంలోని మొత్తం 60 డివిజన్లలోనూ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
త్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూపింది. ఇల్లందులో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో 6 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా 15 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేసింది. అయితే కాంగ్రెస్ సీపీఐ వేసిన డివిజన్లతోపాటు మొత్తం 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వేసింది.కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాలతోపాటు మొత్తం అన్ని చోట్ల నామినేషన్లు వేసింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చెరో దారి చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.
మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా.. వారి తీరుపై మండిపడుతూ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. కొన్ని మున్సిపాలిటీల్లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తూ నామినేషన్లు వేసింది. సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎవరిదారి వారు చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుర పోరులో కాంగ్రెస్, సీపీఐకి పొత్తు కుదరలేదు. క్షేత్రస్థాయిలో సీపీఐ కి ఉన్న బలాన్ని గుర్తించకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చింది. రానున్న ఎంపిటిసి , జడ్పీటీసీ ఎన్ని కల్లో కూడా మిత్రులు గా ఉంటారా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇన్నాళ్లూ మిత్రపక్షం గా ఉన్న సీపీఐ, కాంగ్రెస్ పార్టీ తో బంధాన్ని తెంచేసుకోవడం వల్ల ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతోకొంత ఎదురుదెబ్బ తగులనుందా? అనే టాక్ మెదలైంది. సిపిఐ ఒంటరిగా బరిలోకి దిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్కకు సీపీఐ ఝలక్ ఇచ్చినట్లయింది.