E-Paper
Advertisement

Telangana News: తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్.. ఆయన్ని విచారిస్తున్న అధికారులు

Telangana News: తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్..  ఆయన్ని విచారిస్తున్న అధికారులు

Telangana News:  జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్టు అయ్యారు. దాదాపు రూ. 28 కోట్ల పన్ను ఎగవేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్నారు. అంతేకాదు ఆరెంజ్ ట్రావెల్స్ కంపెనీ ఎండిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్ కుమార్‌ను విచారిస్తున్నారు జీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు.

తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్

ఇయర్ ముగింపు రావడంతో పన్ను ఎగవేత దారులపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పన్ను ఎగవేస్తున్నవారికి నోటీసులు ఇస్తున్నారు. నోటీసులకు స్పందించని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత, బాల్కొండ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ సునీల్ కుమార్‌ని అరెస్టు చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు.

ఆరెంజ్ ట్రావెల్ ఓనరైన సునీల్‌కుమార్, దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు పన్ను ఎగవేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదని సమాచారం. చివరకు బుధవారం ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారట.  ప్రస్తుం జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఆయన్ని విచారణ చేస్తోంది. 

జీఎస్టీ పన్ను ఎగవేత.. ఆయన్ని విచారిస్తున్న అధికారులు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు సునీల్‌కుమార్. బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆయన్ని ఓడించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన ఆయన మూడేళ్లు కిందట బీజేపీలోకి చేరాలని భావించారు. ఎందుకోగానీ అక్కడి ఎంపీ అడ్డుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బహుశా వ్యాపారం నిమిత్తం కమలం తీర్థం పుచ్చుకోవాలని భావించారట ఆయన.

దీన్ని ముందుగానే పసిగట్టిన సదరు ఎంపీ అడుగడుగునా అడ్డుపుల్ల వేసినట్టు పొలిటికల్ సర్కిల్స్ ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఏకంగా జీఎస్టీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు.  సునీల్‌ కుమార్ అరెస్టుతో కొందరు నేతల్లో గుబులు మొదలైంది. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్న పలువురు నేతల్లో టెన్షన్ మొదలైంది. పన్ను ఎగవేస్తే తమను అరెస్టు చేస్తారేమోనన్న భయం వాటిని వెంటాడుతోంది.

ALSO READ: కవిత రాజీనామాను ఆమోదించిన మండలి ఛైర్మన్ గుత్తా

 

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×