E-Paper
Advertisement

Jithender Reddy : తెలంగాణ బీజేపీ నేతలకు ఆ ట్రీట్ మెంట్ ఇవ్వాలి.. జితేందర్ రెడ్డి ట్వీట్ వైరల్..

Jithender Reddy : తెలంగాణ బీజేపీ నేతలకు ఆ ట్రీట్ మెంట్ ఇవ్వాలి.. జితేందర్ రెడ్డి ట్వీట్ వైరల్..
Advertisement

Jithender Reddy Tweet(BJP news telangana) : తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతలు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా ఉన్నారు. మరికొందరు ఈటల రాజేందర్ కు సపోర్టు చేస్తున్నారు. ఇక ఇంకొందరు సొంత అజెండాతో ముందుకెళుతున్నారు. ఇలా బీజేపీలో వర్గపోరు నడుస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పెను దుమారాన్ని రేపింది.

దున్నపోతును తన్ని ట్రక్‌లోకి ఎక్కిస్తున్న వీడియోను జితేందర్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులకు కూడా ఇలాంటి ట్రీట్ మెంట్ అవసరమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, సునీల్ బన్సల్, బీఎల్‌ సంతోష్‌, బీజేపీ పార్టీకి ఈ వీడియోను ట్యాగ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ పెను దుమారాన్ని రేపింది. ఆ వీడియోపైనే చర్చ జరుగుతోంది.

Advertisement

కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జితేందర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా పాల్గొనడంలేదు. కొంతకాలంగా ఆయన వాయిస్ కూడా వినిపించడంలేదు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఆయన సడెన్ గా వివాదాస్పద ట్వీట్ చేసి పార్టీలో అగ్గిరాజేశారు. మరి జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియోపై తెలంగాణ బీజేపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరోవైపు బీజేపీకి చాలా మంది నేతలు షాకిచ్చే యోచనలో ఉన్నారు. కొందరు కీలక నేతలు పార్టీని వీడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జాబితాలో ప్రధానంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం వారిని ఢిల్లీకి పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. మరి జితేందర్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? అందుకే ఈ ట్వీట్ చేశారా? ఆయన కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారా..? ఈ అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related News

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు జోరు.. లక్ష్యాన్ని మించిన దరఖాస్తులు.. ఎన్నో తెలుసా..!

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

Big Stories

Advertisement
×