E-Paper
Advertisement

Biryani: బిర్యానీలో ఏదో తేడాగా కనిపించింది.. ఏంటబ్బా అని చూశాడు, అదేంటో తెలిసి కస్టమర్ షాక్!

Biryani: బిర్యానీలో ఏదో తేడాగా కనిపించింది.. ఏంటబ్బా అని చూశాడు, అదేంటో తెలిసి కస్టమర్ షాక్!
Advertisement

హైదరాబాద్‌లోని బిర్యానీ క్వాలిటీకి సంబంధించిన అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని మలక్‌పేటలో ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీకి పెట్టింది పేరుగా భావించే హోటళ్లలో పరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిర్యానీలో బొద్దింక..

Advertisement

మలక్‌పేట-మూసారాంబాగ్ చౌరస్తాలో ఉన్న ఆజెబో (Ajebo) రెస్టారెంట్‌లో విరక్తి కలిగించిన ఘటన చోటుచేసుకుంది. ఒక కస్టమర్ తన ఆకలి తీర్చుకోవడానికి ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే, వడ్డించిన బిర్యానీని తినడం ప్రారంభించే లోపే అందులో చనిపోయి ఉన్న బొద్దింక కనిపించడంతో ఆ కస్టమర్  ఒక్కసారిగా ఖంగుతిన్నారు. హోటల్ యాజమాన్యం అనుసరిస్తున్న అపరిశుభ్రత పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సిబ్బంది ఏమన్నారంటే..?

Advertisement

బిర్యానీలో బొద్దింక వచ్చిన విషయాన్ని సదరు కస్టమర్ వెంటనే రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. కనీసం క్షమాపణలు చెప్పి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి.. సిబ్బంది ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కస్టమర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో చిన్న విషయం జరిగినట్లుగా వారు మాట్లాడటం, కస్టమర్ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో వివాదం మరింత పెద్దదైంది. డబ్బులు తీసుకుని నాణ్యత లేని, అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా.. ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీస బాధ్యత లేకుంటే ఎలా..?

నగరంలోని అనేక రెస్టారెంట్లు కేవలం లాభాపేక్షతోనే నడుస్తున్నాయని.. కస్టమర్ల ఆరోగ్యం పట్ల కనీస బాధ్యత ఉండటం లేదని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. కిచెన్‌లలో కనీస శుభ్రత పాటించకపోవడం, నిల్వ ఉంచిన పదార్థాలను వాడటం వంటి పనుల వల్ల ప్రజలు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు. గతంలో కూడా మలక్‌పేట పరిసర ప్రాంతాల్లోని పలు హోటళ్లపై జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు దాడులు నిర్వహించినా, పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆజెబో రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కస్టమర్‌తో పాటు నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి.. సదరు హోటల్‌లో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే భారీ జరిమానాతో పాటు లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతున్నారు. బయట హోటళ్లలో తినేముందు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Most Expensive Helmets: ఈ బైక్ హెల్మెట్ ధర రూ.2.3 కోట్లు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×