E-Paper
Advertisement

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ
Advertisement

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీవాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు రాఘవను ప్రవేశపెట్టారు. సౌత్ గ్రూప్ తరుపున చెల్లించిన రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర ఉందని.. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో రాఘవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ అధికారులు వివరించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు రాఘవను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

ఈ మేరకు వాదనలు విన్న కోర్టు రాఘవకి కస్టడీ విధించింది. ఈడీ అధికారులు కోరినట్లుగానే 10 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. కస్టడీ ముగిశాక రాఘవను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను అదేశించింది.

Advertisement

ఇక ఈ కేసుకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోగా… పంజాబ్‌కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఎదుట గోరంట్ల బుచ్చిబాబును హాజరుపర్చారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. అయితే కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక గౌతమ్ మల్హోత్రాను కూడా అదే రోజు కోర్టులో హాజరుపర్చి కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా.. ఏడు రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×