E-Paper
Advertisement

ED: ఈడీ రాక్స్.. 2 స్టేట్స్ షేక్స్..

ED: ఈడీ రాక్స్.. 2 స్టేట్స్ షేక్స్..
Advertisement

ED: ఈడీ వదల బొమ్మళీ అంటోంది. డే బై డే విచారణ చేస్తోంది. ఏ మాత్రం రెస్ట్ లేదు. అసలేమాత్రం రిలాక్స్ లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాంచి దూకుడు మీదుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ.. మరిన్ని బిగ్ ఫిష్‌ల వేటలో బిజీగా ఉంది.

ఎమ్మెల్సీ కవిత. ఈడీ బిగ్ టార్గెట్. ఇప్పటికే ఓసారి సుదీర్ఘంగా విచారించింది. 16న మళ్లీ రమ్మని పిలిచింది. టాస్ట్ మినిట్‌లో కవిత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను రాలేనంటూ.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వస్తానంటూ.. ఈడీకి మెయిల్ చేసి.. తన ప్రతినిధిగా లాయర్‌ను పంపించి దర్యాప్తు సంస్థ అడిగిన పత్రాలు అందజేసింది. చివర్లో కవిత హ్యాండ్ ఇవ్వడంతో.. ఈడీ షాకైనా వెంటనే తేరుకుంది. అలాగైతే ఈ నెల 20న విచారణకు రావాలంటూ మళ్లీ ఫ్రెష్‌గా నోటీసులు పంపించింది.

Advertisement

సుప్రీంలో కవిత పిటిషన్ విచారణ ఈ నెల 24న జరగనుంది. అంతకుముందే 20నే ఈడీ రమ్మంది. అంటే.. కవిత డిమాండ్‌కు ఈడీ తలొగ్గలేదనే అంటున్నారు. మరి, 20న అయినా కవిత వెళ్తారా? ఆమె రాకపోతే అరెస్ట్ చేస్తారా? మరో ఛాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

కవిత కోసం ఈడీ పక్కాగా ప్లాన్ చేసినట్టుంది. ఆమెకు బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ గురువారం ముగిసింది. అయితే, పిళ్లైని కవితని ఎదురెదురుగా ఉంచి విచారించాలంటూ స్పెషల్ కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ కేసులో కవిత అనుమానితురాలని.. అందుకే రామచంద్ర పిళ్లై కస్టడీని మరో 5 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందరినీ ఒకేసారి విచారించాల్సిన అవసరం ఏముందని ఈడీని ప్రశ్నించింది. డాక్యుమెంట్లు చూపించి విచారించొచ్చుగా అంటూ వ్యాఖ్యానించింది. పిళ్లైని ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది కోర్టు.

Advertisement

ఇక్కడే మరో ట్విస్ట్. కవితను ఈ నెల 20న విచారణకు పిలిచింది ఈడీ. పిళ్లైకి సైతం ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అంటే, 20న కవిత విచారణకు వస్తే.. పిళ్లైని ఎదురుగా ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంది.

ఈడీ దర్యాప్తు అటు ఏపీలోని అధికార వైసీపీనీ షేక్ చేసేలా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 18న విచారణకు రావాలంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఇదే కేసులో శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగా.. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ కేసులో శ్రీనివాసులరెడ్డి ప్రమేయం కూడా ఉందని భావిస్తుండటంతో ఆయనకూ ఈడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దాదాపు కొలిక్కి వచ్చిందని స్పెషల్ కోర్టుకు తెలిపింది ఈడీ. కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డిలను ప్రశ్నించడం పూర్తైతే.. ఇక కేసు విచారణ ముగిసినట్టేనని కోర్టుకు వెల్లడించింది. అంటే, లిక్కర్ స్కాం కేసు క్లైమాక్స్‌కు చేరినట్టేనా? కవిత, మాగుంటల అరెస్ట్‌తో ఎండ్ అవుతుందా? ఇలా, ఈడీ దూకుడుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. అధికార పార్టీల్లో ఆందోళన పెరిగింది.

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..

Crazey Foods : ఆ ఆహార పదార్థాలకు యువతలో పెరుగుతున్న క్రేజ్..

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×