E-Paper
Advertisement

Falaknuma : నటుడు కావాలని డ్రీమ్.. కానీ స్మగ్లర్‌గా మారాడు.. ఇలా పోలీసులకు చిక్కాడు..!

Falaknuma :  నటుడు కావాలని డ్రీమ్.. కానీ స్మగ్లర్‌గా మారాడు.. ఇలా పోలీసులకు చిక్కాడు..!
Advertisement

Falaknuma : వెండితెరపై నటుడిగా వెలగాలనుకున్నాడు. అవకాశాలు రాక ఆ వ్యక్తి డ్రగ్స్‌ స్మగ్లర్ గా మారాడు. డ్రగ్స్ దందా చేస్తూ నగర టాస్క్‌ఫోర్స్‌, ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. డీసీపీ పి.సాయిచైతన్య వెల్లడించిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్‌ అమీర్‌(33) అనే యువకుడు ఏడాది క్రితం ముంబయి వెళ్లాడు. అక్కడ మోడలింగ్‌, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.

కొన్ని సినిమాల్లో చిన్న వేషాలు వేశాడు. ఆ సమయంలోనే డ్రగ్స్ కు అలవాటుపడ్డాడు. అక్కడ వచ్చే సంపాదన సరిపోక తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు. రియల్‌ ఎస్టేట్‌ దళారీగా ఉపాధి చూసుకున్నాడు. ఆ డబ్బులు సరిపోకపోవటంతో కొత్త పథకం వేశాడు.సినిమాల కోసమని విమానంలో ముంబయికి వెళ్లేవాడు. 20-40 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేసి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్ కు వస్తుండేవాడు. గ్రాము ఎండీఎంఏ రూ.4000లకు కొనుకుని వచ్చి ఇక్కడ రూ.8000 నుంచి రూ10,000 వారకు అమ్మేవాడు.

Advertisement

4 నెలలుగా ప్రతి నెలా 2 సార్లు వెళ్లి వచ్చేవాడు. ఇతడి కదలికలపై టాస్క్‌ఫోర్స్‌, ఫలక్‌నుమా పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం వట్టేపల్లి వద్ద కేశవగిరికి చెందిన జుబేర్‌ అలీ(27)కు ఎండీఎంఏ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ముంబయికు చెందిన ప్రధాన సరఫరాదారుడు రెహాన్‌ పటేల్‌ వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేశాడని నిర్ధారించారు. మహ్మద్‌ అమీర్‌, జుబేర్‌ అలీలను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×