E-Paper
Advertisement

కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!

కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!
Advertisement

Farmers Protest: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు కుషాయిగూడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ పేరుతో తమకు సంబంధించిన సుమారు రూ.250 కోట్ల నష్టపరిహారం డబ్బులు మోసపూరితంగా కొల్లగొట్టారని ఆరోపించారు.సుమారు 25 గ్రామాలకు చెందిన వందలాది మంది బాధిత రైతులు కుషాయిగూడ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి తమ డబ్బులు దోచుకున్నారని రైతులు తెలిపారు.

Also Read: వేగంగా ధాన్యం సేకరణ.. రైతు ముంగిటకే కొనుగోలు వ్యవస్థ, స్టీఫెన్ రవీంద్ర పరిశీలన

న్యాయం చేయాలని డిమాండ్..

Advertisement

ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, నిందితుల ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా పాశం యాదగిరి మద్దతు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, భూములు కోల్పోయిన రైతులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Also read: దుర్గమ్మ సన్నిధిలో రంభ..రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటి!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×