E-Paper
Advertisement

కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!

కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!
Advertisement

Farmers Protest: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు కుషాయిగూడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ పేరుతో తమకు సంబంధించిన సుమారు రూ.250 కోట్ల నష్టపరిహారం డబ్బులు మోసపూరితంగా కొల్లగొట్టారని ఆరోపించారు.సుమారు 25 గ్రామాలకు చెందిన వందలాది మంది బాధిత రైతులు కుషాయిగూడ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి తమ డబ్బులు దోచుకున్నారని రైతులు తెలిపారు.

Also Read: వేగంగా ధాన్యం సేకరణ.. రైతు ముంగిటకే కొనుగోలు వ్యవస్థ, స్టీఫెన్ రవీంద్ర పరిశీలన

న్యాయం చేయాలని డిమాండ్..

Advertisement

ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, నిందితుల ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా పాశం యాదగిరి మద్దతు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, భూములు కోల్పోయిన రైతులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Also read: దుర్గమ్మ సన్నిధిలో రంభ..రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటి!

Related News

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Big Stories

Advertisement
×