Political Clash: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలను రాహు, కేత గ్రహం అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. అసలు నవ గ్రహాల్లో ఆయన ఉన్నారా? అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఎంపీ చామల మాట్లాడుతూ…రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన బండి సంజయ్ కు లేదన్నారు. మెట్రో పేజ్ 2,ట్రిపుల్ ఆర్,మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపీ వైఖరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు.
భువనగిరి లోక్ సభ పరిధిలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం కేంద్ర మంత్రులుగా ఉన్న బండి, కిషన్ రెడ్డిలపై ఉన్నదన్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసునని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకు ఆదేశిస్తే 24 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి గతంలో అన్నారని, 2025 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అవసరం లేని వాటికి బీజేపీ జేబు సంస్థలు సీబీఐ,ఈడీ,ఐటీని వాడుతున్నారని, కానీ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినోళ్లపై ప్రయోగించడం లేదన్నారు.
Also read: వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!
బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలి లక్ష కోట్లు వృథా అయ్యాయని చెప్పారు. ఇక కాంగ్రెస్ కు కాళేశ్వరం ఏటీఎమ్ గా ఎందుకు మారుతుందని బండి సంజయ్ చెప్పడం విచిత్రంగా ఉన్నదన్నారు. మరోవైపు జీవన్ రెడ్డి ఆలోచన లేని పనిచేశారన్నారు. బీఆర్ఎస్ లో చేరగానే జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారని, కానీ జగిత్యాలలో జీవన్ రెడ్డి సీన్ అయిపోయిందన్నారు. కాంగ్రస్ పార్టీలో అలిగినట్లు బీఆర్ఎస్ లో అగితితే పట్టించుకోరన్నారు. గతంలో పొన్నాల లక్షయ్య పరిస్థితి ఏమైందో? అందరికీ తెలుసునని చెప్పారు. ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుందని ఆయన వివరించారు.
Also Read: పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు కొత్త రూల్స్.. మే 1 తర్వాత ఇది తప్పదా?