E-Paper
Advertisement

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు

Sangareddy News: సమ్మర్ రాకముందే అగ్రిప్రమాదాలు జోరందుకున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మిల్లులోని సామాగ్రి ఖాళి బూడిదైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగైదు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.

ఆదివారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంగ్టి మండలం తుర్కా వడగామలోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో ఈ ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ, వేకువజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అందులోని సిబ్బంది అలర్టయి, ఫైర్ ఇంజన్-పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈలోగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అందులోని సామాగ్రి దాదాపు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మూడు వేల టన్నులకు పైగా పత్తి కాలపోయింది. దాదాపు రెండు కోట్ల నష్టం జరిగిందన్నది ఆ సంస్థ యజమాని మాట. అయితే ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×