Sangareddy News: సమ్మర్ రాకముందే అగ్రిప్రమాదాలు జోరందుకున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మిల్లులోని సామాగ్రి ఖాళి బూడిదైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగైదు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆదివారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంగ్టి మండలం తుర్కా వడగామలోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో ఈ ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ, వేకువజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అందులోని సిబ్బంది అలర్టయి, ఫైర్ ఇంజన్-పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈలోగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అందులోని సామాగ్రి దాదాపు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మూడు వేల టన్నులకు పైగా పత్తి కాలపోయింది. దాదాపు రెండు కోట్ల నష్టం జరిగిందన్నది ఆ సంస్థ యజమాని మాట. అయితే ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కా వడగామలో భారీ అగ్ని ప్రమాదం
శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో ఎగసిపడుతున్న మంటలు
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది pic.twitter.com/R0uNE2xLYH
— BIG TV Breaking News (@bigtvtelugu) December 21, 2025