E-Paper
Advertisement

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు
Advertisement

Sangareddy News: సమ్మర్ రాకముందే అగ్రిప్రమాదాలు జోరందుకున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మిల్లులోని సామాగ్రి ఖాళి బూడిదైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగైదు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.

ఆదివారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంగ్టి మండలం తుర్కా వడగామలోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో ఈ ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ, వేకువజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అందులోని సిబ్బంది అలర్టయి, ఫైర్ ఇంజన్-పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

ఈలోగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అందులోని సామాగ్రి దాదాపు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మూడు వేల టన్నులకు పైగా పత్తి కాలపోయింది. దాదాపు రెండు కోట్ల నష్టం జరిగిందన్నది ఆ సంస్థ యజమాని మాట. అయితే ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

 

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×