E-Paper
Advertisement

Mettu vs Vivekananda: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కబ్జా చిట్టా ఇదిగో.. మోసం చేసిందెవరు?

Mettu vs Vivekananda: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కబ్జా చిట్టా ఇదిగో.. మోసం చేసిందెవరు?
Advertisement

Mettu vs Vivekananda: బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కబ్జా చిట్టాను విప్పి బయటపెట్టారు. మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడటాన్ని తప్పుబట్టారు.

మత్స్యకార ఫెడరేషన్‌ని కార్పొరేషన్ కాకుండా చేసిందెవరని ప్రశ్నించారు సాయి కుమార్. బండా ప్రకాష్ ముదిరాజ్ కాదా? మత్సకార కుటుంబాలను దోచుకుంది మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

Advertisement

పదేళ్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 70 శాతం చెరువులు, కుంటలను ఎమ్మెల్యే కబ్జా చేయలేదా అని అన్నారు. వివేకానంద కబ్జా చిట్టా మావద్ద ఉందని, అన్ని బయట పెడతామన్నారు. గత ప్రభుత్వం కనీసం మత్స్యకార కుటుంబాలను ఆదుకొనే పాపాన పోలేదన్నారు.

మత్స్యకార కుటుంబాలను లక్షాధికారులను చేయాలన్న ధ్యేయంతో సీఎం రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9న 32 జిల్లాల్లోని మహిళా మత్సకారులకు 60 శాతం సబ్సిడీ‌తో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ స్టాల్స్ వాహనాలను ఇవ్వబోతున్నామని తెలిపారు.

Advertisement

ALSO READ: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌, కిషన్ రెడ్డి లను ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్

ఎమ్మెల్యే వివేకానంద.. మత్స్యకారుల గురుంచి మాట్లాడే ముందు గాంధీ‌భవన్‌లో తన నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాలన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఏం చేసిందో తెలుస్తుందన్నారు. అంతేగానీ ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×