Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ MLA కొండిగారి రాములు పరమాపదించారు. ఆయన రెండు సార్లు ఇబ్రహీంపట్నం నుండి CPM MLA గా పనిచేశారు. కొద్ది సేపటి క్రితం అనారోగ్య సమస్యలతో ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో అయన బందువులు కన్నీరు మున్నీరయ్యారు.
Also read: Bamboo Smuggling: అశ్వారావు పేటలో జోరుగా కలప వెదురు దందా.. పట్టించుకోని అధికారులు
కొండిగారి రాములు 1989, 1994 సంవత్సర కాలంలో రెండు సార్లు సీపీయం(CPM) పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సంక్షేమ శాఖ కమిటీ సభ్యుడిగా గతంలో ఆయన పని చేశారు. ఆయన అనేక కీలక మైన పదవుల్లో పని చేసినప్పటికి నేటి వరకు ఆయన ఒక సాదారన వ్యక్తిగానే జీవించారు. నిత్యం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. ప్రస్తుతం ఇబ్రహీం పట్నం ప్రాంతంలో తన సోంత ఇంట్లోనే ఉంటూ సాదారణ జీవితాన్ని గడిపారు. ఆయనకి ఇద్దరు కుమారులు ఉండగా ఓ కుమారుడు చనిపోయాడు. ప్రస్తుతం అతని రెండో కుమారుడు ప్రైవేటుగా చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నేటి సమాజంలో రాజకీయం అనేది డబ్బుచుట్టూ తిరుగుతున్నాయని అందుకు కొండిగారి రాముులు క్రయాశీలక రాజయాల్లో పనిచేయలేక పోయానని గతంలో అన్నారు. ప్రస్థుతం అతని మరణ వార్త విన్నవారందరు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన మరణంతో ఇబ్రహీంపట్నం ప్రాంతం అంతా విషాదంతో అలుముకుంది.