Cyber Crime: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని భారీగా సొమ్ము పోగొట్టుకోవడం సామాన్యులకే కాదు.. సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా ఎదురవుతున్న ముప్పు అని మళ్లీ నిరూపిస్తోంది ఈ సంఘటన. మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనాారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసానికి గురై ఏకంగా రూ. 2.58 కోట్లు పోగొట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గత ఏడాది నవంబర్ నెలలో ఊర్మిళ వాట్సప్ నెంబరుకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన ఓ లింక్ వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే.. అనూహ్యంగా 500 రెట్లు లాభం వస్తుందని సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. ట్రేడింగ్పై పూర్తి అవగాహన లేకపోవడంతో.. ఆమె తన భర్త లక్ష్మీనారణ సహాయం తీసుకున్నారు. అయితే నేరగాళ్లు పంపిప యాప్, వారు చూపించిన తప్పుడు లాభాల గ్రాఫ్లను చూసి నిజమని నమ్మిన దంపతులు, డిసెంబర్ 24 నుండ జనవరి 5 మధ్య కేవలం కొద్ది రోజుల్లోనే.. 19 విడతలుగా రూ. 2.58 కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ చేశారు.
పెట్టుబడి పెట్టిన తర్వాత సుమారు రూ.2 కోట్ల లాభం వచ్చినట్లు సైబర్ నేరగాళ్లు యాప్లో చూపించారు. అయితే.. ఆ సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు.. ట్యాక్సుల పేరుతో మరికొంత సొమ్ము చెల్లించాలని వారు కోరారు. దీంతో అనుమానం వచ్చని లక్ష్మీనారాయణ దంపతులు తాము మోసపోయామని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి.. ఈ నేరానికి పాల్పడిన బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ. 45 లక్షల నగదును సీజ్ చేశారు.
ALSO READ: ఇండియా, ఈయూ ట్రేడ్ డీల్ కుదిరింది.. ఈ డీల్ తో భారత్ జరగే లాభం ఇదే!