Devji Exam: జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దశాబ్దాల పాటు విప్లవ పంథాలో సాగిన ఒక వ్యక్తి, మళ్లీ అక్షరం వైపు అడుగులు వేయడం విశేషం. మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ (అలియాస్ వారణాసి తిరుపతి) బుధవారం కోరుట్ల పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యారు.
దేవ్జీ ప్రయాణం నిజంగా ఒక సినిమాని తలపిస్తుంది. సరిగ్గా 1984-85 విద్యా సంవత్సరంలో ఆయన కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అయితే, ఆ సమయంలో సమాజంలోని రుగ్మతలు, విప్లవ భావజాలం పట్ల ఆకర్షితులై చదువును మధ్యలోనే వదిలేశారు. అడవి బాట పట్టి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో అత్యున్నత స్థాయి అయిన కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
గత ఏడాది అనారోగ్య కారణాలతో ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. లోకజ్ఞానం ఎంత ఉన్నా, అధికారికంగా విద్యా అర్హత ఉండాలనే ఉద్దేశంతో ఆయన మళ్లీ పుస్తకం పట్టారు. 40 ఏళ్ల క్రితం ఎక్కడైతే చదువు ఆగిపోయిందో, మళ్లీ అదే ఊరిలో పరీక్ష రాయడం గమనార్హం. సాధారణ విద్యార్థులతో కలిసి ఆయన పరీక్ష రాస్తున్న తీరు చూసి తోటి వారు, అధికారులు ఆశ్చర్యపోయారు. ‘నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, లక్ష్యం ఉంటే అక్షరం దానంతట అదే వస్తుంది’ అని ఆయన నిరూపించారు. ఒకప్పటి విప్లవ యోధుడు ఇప్పుడు అక్షర యోధుడిగా మారడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: మరోసారి లాక్డౌన్ దిశగా భారత్..? ప్రధాని మోదీ హెచ్చరికల వెనుక అసలు నిజమిదే!
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ పరీక్షకు హాజరైన మాజీ మావోయిస్టు దేవ్ జీ
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పరీక్ష రాసిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ అలియాస్ తిరుపతి
1984-85 విద్యా సంవత్సరంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్… pic.twitter.com/uvzMWtfEcP
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2026