E-Paper
Advertisement

Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్.. ఒక్క రోజుకి నాలుగు కోట్లా?

Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్.. ఒక్క రోజుకి నాలుగు కోట్లా?

Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేటీఆర్ అరెస్టుపై హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. తీర్పు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కాకపోతే ఈ కేసులో సెక్షన్ 405, 409 గురించే వాదనలు, గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు ప్రస్తావించారు. దర్యాప్తు ప్రారంభంలో ఈ విధంగా చేయడం కరెక్టు కాదన్నది ఏసీబీ వైపు మాట.

ఫార్ములా కేసు వాదించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తరపున ఢిల్లీ నుంచి న్యాయ వాదులు వచ్చారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే. ఒక్క రోజుకు ఆయన నాలుగు కోట్ల రూపాయలు ఫీజు ఛార్జ్ చేస్తారంటూ ఢిల్లీలో చర్చించుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని కేటీఆర్ తన లాయర్‌గా పెట్టుకుంటున్నారని అంటున్నారు. తప్పు చేయనప్పుడు ఇంత ‘రిచ్‌’గా భయపడడం ఎందుకంటూ సోషల్ మీడియాలో సైటెర్లు పడిపోతున్నాయి.

నార్మల్‌గా అయితే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు వాదించే కేసులకు ఫీజు భారీ మొత్తంలో ఉంటాయి. కానీ ఎంత అనేది మాత్రం బయటపడదు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేసుపై చాలామంది పోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఫార్ములా రేసును భారీ ఖర్చుగా చాలా దేశాలు భావిస్తున్నాయి. కెనడా, సౌతాఫ్రికా, ఇటలీ, ఇండోనేషియా లాంటి దేశాలు దీన్ని రద్దు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. 2017 లో కెనడా ఆ తరహా రేసును రద్దు చేసింది. ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక భారమని భావించి రద్దు చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్‌రెడ్డి

2023లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ రేసు చేసుకున్నట్లు చెబుతున్నారు. భారత కరెన్సీలో దాదాపు రూ.137 కోట్లు ఖర్చు అనవసరమని దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటలీ కూడా పైకి భద్రతా కారణాలు ప్రచారం చేసినా, అసలు కారణం ఆర్థిక భారమేనని భావించి తప్పుకుందని తెలుస్తోంది. ఇండోనేషియాలో అయితే ప్రతిపక్షాల నిరసనలతో 2020-24 రేసులు రద్దు అయ్యాయి. లేకుంటే ప్రభుత్వానికి 688 కోట్ల నష్టం వచ్చేదని భావిస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్గాతీయ పత్రికలు సైతం పేర్కొన్నాయి.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×