Fuel Shortage: యుద్దం ఎఫెక్ట్ ఇప్పుడు భారత దేశాన్ని తాకింది. ఇరాన్-ఇజ్రయెల్ యుద్దం కారనంగా ముడిచమురుపై అంతరాలు ఎర్పడుతున్నాయి. దీంతో భారతదేశంలోని పెట్రోల్ బంకులకు ముందస్తుగా నిధులు చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్పాయి. దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఎర్పడింది. ఇటు హైదరాబాద్లో కూడా కొన్ని బంకులు ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.
Also Read: SFI Protest: గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్.. లేదంటే..?
ఇప్పటికే పవర్ పెట్రోల్ పై ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేసాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అక్కడక్కడ బంకుల్లో నో స్టాక్ బోర్డులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహన దారులు తమ రాకపోకలు సాగించడంలో తీవ్ర ఇబ్బందుల ఎదురవుతున్నాయని తెలుపుతున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇందన కొరత కారణంగా ఇప్పటికే హైదరాబాద్లో దాదాపుగా 20-30% బంకులు తాత్కాలికంగా మూసేసినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పెట్రోల్ కొరతతో తమకు తీవ్ర ఇబ్బందుల ఎదురవుతాయని వాపోయారు. ప్రభుత్వాలు దయచేసి మా సమస్యను పరిష్కరించాలని తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.
పెట్రోల్ బంక్లకు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సెగలు
హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
ఇప్పటికే పవర్ పెట్రోల్పై ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు
నో స్టాక్ బోర్డులు చూసి ఆందోళన చెందుతున్న వాహన దారులు
హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులకు సైతం నో… pic.twitter.com/BSNH0LU1iK
— BIG TV Breaking News (@bigtvtelugu) March 22, 2026
Also Read: Food Raid: చిట్టి చిట్టి సమోసాలు తింటున్నారా.. అయితే మీరు డేంజర్లో పడినట్టే..?