E-Paper
Advertisement

G Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్

G Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్
Advertisement

Union Minister G Kishan Reddy news(TS today news): హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పరీక్ష అవకతవకలపై యువజన విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

నీట్ పరీక్ష విధానంలో జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. అయితే అనుమతి ఇవ్వకపోవడంతో యువజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

Advertisement

నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ విషయంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బర్కత్ పురలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన చేపడుతున్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

వెంటనే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌తోపాటు ఎన్ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీవైసీ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.

Advertisement

Also Read: బొగ్గు రాజకీయం.. కేటీఆర్ చెప్పినదానిలో నిజమెంత ?

కాగా, నీట్ రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నీట్‌లో జరిగిన అవకతవకలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం పీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్..నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ పాలన పేపర్ లీకుల సర్కార్‌గా మారిందని విమర్శలు చేశారు.

Tags

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×