Gadwal Priest: స్వేచ్చ బ్యూరో: తనకు తండ్రిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో యేళ్లుగా తమ జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ కుమారుడు తన తల్లితో కలిసి శుక్రవారం గద్వాల పట్టణంలోని ఒక ప్రధాన అర్చకుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
గద్వాల పట్టణం బీసీ కాలనికి చెందిన ఒక మహిళ సుమారు 24 క్రితం ప్రధాన అర్చకుడి ఇంటిలో పని చేసేది. ఈ క్రమంలో తాను చిన్నతనంలో ఉన్నప్పుడు సదరు ప్రధాన అర్చకుడు తనపై అకృత్యానికి పాల్పడి మోసం చేశాడని, ఆ క్రమంలో తాను గర్భవతిని కాగా బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. సమాజానికి, ప్రాణభయానికి వెనకాడి ఇన్నాళ్లూ దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి తన కుమారుడిని డిగ్రీ వరకు చదివించినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.
Also read: భారతీయులంటే లోకువ.. విదేశాల కంటే తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్న బడా కంపెనీలు
ఈ సందర్భంగా బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ “స్థానికంగా జరిగిన ఒక వివాదంలో తండ్రి పేరు విషయంలో ఎదురైన మాటల వల్ల నాకు నిజం తెలిసింది. నా తండ్రిని న్యాయం చేయమని అడిగితే చంపుతానని, చేతబడి చేయిస్తానని బెదిరించారు. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో నన్ను కొడుకుగా ఒప్పుకుని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పిన అర్చకుడు గత 25-30 రోజులుగా ఫోన్ కాల్స్ ఎత్తకుండా, నంబర్లు బ్లాక్ చేస్తూ తప్పించు తిరుగుతున్నారు.
ఇన్నాళ్లు కష్టపడి పెంచిన నా తల్లికి, నాకు చట్టబద్ధమైన గుర్తింపు దక్కే వరకు న్యాయపోరాటం ఆపేది లేదు” అని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న గద్వాల పోలీసులు అక్కడకి చేరుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన అర్చకుడి భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇది ఇలా ఉండగా నేను ఏ తప్పు చేయలేదు. డీఎన్ ఏ టెస్టుకైన సిద్దంగా ఉన్నాని ప్రధాన అర్చకుడు ప్రకటించారు.
Also read: భారతీయులంటే లోకువ.. విదేశాల కంటే తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్న బడా కంపెనీలు