Gas Shortage: మెదక్ జిల్లా లో యుద్ధం ఎఫెక్టు స్పష్టంగా కనిపిస్తోంది.ఏకంగా ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో లడ్డు తయారీకి గ్యాస్ దొరకక కట్టెల పొయ్యిని వాడుతున్నారు. స్వయంగా ఈవోనే ఈ విషయాన్ని వెల్లడించారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలతో నర్సాపూర్ పట్టణంలో నీ రెస్టారెంట్లు,హోటల్స్ లో వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్లను జిల్లా పౌరసరఫరా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: scientific secrets: మొలతాడు కట్టుకోవడంలో దాగి ఉన్న సైన్స్ రహస్యాలు ఏంటో తెలుసా..?
ప్రభుత్వం హైలెవల్ కమిటీ వేయడం, జిల్లా స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు గ్యాస్ నిర్మలపై మానిటర్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, రాష్ట్ర పౌరసరపల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం తో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. గ్యాస్ కొరత లేదని,స్పష్టం చేశారు.ప్రజలకు సరిపడ గ్యాస్ నిలువలు ఉన్నాయనీ కలెక్టర్ ప్రతిమా సింగ్ వెల్లడించారు. గ్యాస్ ఏజెన్సీ అక్రమాలకు పాలు కొడితే కోరుకునేది లేదని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ నాగేష్,జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Also Read: Healthy Drink: రోజూ నిమ్మరసం, మెంతుల నీరు తాగారంటే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు