E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త విధానం.. ఇకపై చాలా ఈజీ, అదెలా అంటే..?

GHMC: జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త విధానం.. ఇకపై చాలా ఈజీ, అదెలా అంటే..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ అధికారులు కీలక మార్పులు చేపట్టారు. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, జాప్యాన్ని తగ్గించేందుకు సరికొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలులోకి తెచ్చారు.

సాధారణంగా ఆసుపత్రుల్లో జరిగే జనన, మరణాల వివరాలు నేరుగా ఆసుపత్రి యాజమాన్యాల ద్వారా పోర్టల్‌లో నమోదవుతాయి. అయితే, ఇంట్లో జరిగే జననాలు లేదా మరణాల విషయంలో తల్లిదండ్రులు లేదా బంధువులు నేరుగా కార్పొరేషన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం, డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే.. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకుని, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసుకోవాలి. అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహించి వివరాలను ధృవీకరించిన తర్వాతే సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.

నగర విస్తరణ నేపథ్యంలో.. పాత జీహెచ్‌ఎంసీ ప్రాంతాలతో పాటు కొత్తగా విలీనమైన మున్సిపల్ బాడీలను కలుపుతూ ఈ వ్యవస్థను రూపొందించారు. మొత్తం 60 సర్కిళ్లు, కొత్తగా మ్యాపింగ్ చేసిన 300 వార్డుల పరిధిలో ‘యూనిఫాం సిస్టమ్’ (ఏకీకృత విధానం) అమలు కానుంది. దీనివల్ల నగరం నలుమూలల ఉన్న ప్రజలకు ఒకే రకమైన సేవలు అందుతాయి. గతంలో సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఈ నూతన వ్యవస్థ ద్వారా వేగంగా పత్రాలను పొందే వీలుంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్పుల వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, మధ్యవర్తుల బెడద తప్పుతుందని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. వార్డు స్థాయిలోనే డేటా ఎంట్రీ మరియు ధృవీకరణ ప్రక్రియలు జరగడం వల్ల తప్పులు దొర్లే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రజలు తమకు సమీపంలోని వార్డు ఆఫీసుల ద్వారానే ఈ సేవలను పొందేలా చర్యలు తీసుకున్నారు. ఈ నూతన విధానం పౌరుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ప్రభుత్వ రికార్డులను పక్కాగా నిర్వహించడానికి దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ALSO READ: Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ రూ. 25 కోట్ల ఆడియోపై బాధితురాలి సంచలన వివరణ!

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×