E-Paper
Advertisement

TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. టీటీడీ కీలక నిర్ణయం..

TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. టీటీడీ కీలక నిర్ణయం..
Advertisement

TTD: శ్రీవారి ఆలయం సంపూర్ణంగా స్వర్ణమయం కానుంది. ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయనున్నారు. ఆరు నెలల్లో తాపడం పనులు పూర్తి చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. భక్తులు సమర్పించే బంగారంతోనే ఆనంద నిలయానికి తాపడం చేయించనున్నారు. ఫిబ్రవరి 23న బాలాలయ పనులు ప్రారంభించనున్నారు.

టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

Advertisement

పద్మావతి గృహంలో రూ. 3.8 కోట్లతో గదులు నిర్మించడం.. నందకం అతిథి గృహంలో రూ.2.95 కోట్లతో కొత్త ఫర్నీచర్ ఏర్పాటు చేయడం.. బాలాజీ కాలనీలో రూ. 3 కోట్లతో స్థానికుల ఇళ్లకు మరమ్మతులు చేయించడం.. ఇలా పలు నిర్ణయాలు తీసుకుంది టీటీడీ పాలక మండలి.

జమ్ములో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ.7 కోట్లు, తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో హాస్టల్ గదుల నిర్మాణానికి రూ. 3.3 కోట్లు, తిరుపతి తాతయ్య అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.3.7 కోట్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×