E-Paper
Advertisement

Governor : బోనాలకు ఆహ్వానం అందలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ కామెంట్స్..

Governor : బోనాలకు ఆహ్వానం అందలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ కామెంట్స్..
Advertisement

Governor : తెలంగాణలో రాజభవన్, ప్రగతి భవన్ మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వివాదం రేగుతోంది. ప్రొటోకాల్ వివాదంతో గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తొలుత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అనేక ఇష్యూల్లో తమిళిసై , మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం పంపకపోవటం తెలంగాణలో కామన్ గా మారింది. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ ఇదే జరిగింది. తాజాగా బోనాల పండుగ వేళ మరో వివాదం మొదలైంది.

ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు తనకు పిలుపు రాలేదని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించారు. అందుకే రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నానని తెలిపారు. పాతబస్తీలో లాల్‌ దర్వాజా బోనాల జరుగుతున్న వేళ రాజ్‌భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారికి గవర్నర్‌ తమిళిసై బోనం సమర్పించారు. వడి బియ్యం పోశారు.

Advertisement

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని వివరించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలని అమ్మవారిని కోరుకున్నానని తమిళిసై చెప్పారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×