E-Paper
Advertisement

Governor : బోనాలకు ఆహ్వానం అందలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ కామెంట్స్..

Governor : బోనాలకు ఆహ్వానం అందలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ కామెంట్స్..
Advertisement

Governor : తెలంగాణలో రాజభవన్, ప్రగతి భవన్ మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వివాదం రేగుతోంది. ప్రొటోకాల్ వివాదంతో గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తొలుత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అనేక ఇష్యూల్లో తమిళిసై , మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం పంపకపోవటం తెలంగాణలో కామన్ గా మారింది. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ ఇదే జరిగింది. తాజాగా బోనాల పండుగ వేళ మరో వివాదం మొదలైంది.

ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు తనకు పిలుపు రాలేదని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించారు. అందుకే రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నానని తెలిపారు. పాతబస్తీలో లాల్‌ దర్వాజా బోనాల జరుగుతున్న వేళ రాజ్‌భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారికి గవర్నర్‌ తమిళిసై బోనం సమర్పించారు. వడి బియ్యం పోశారు.

Advertisement

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని వివరించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలని అమ్మవారిని కోరుకున్నానని తమిళిసై చెప్పారు.

Related News

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కమార్!

అధ్యక్షా మిమ్మల్నే తిడతారా.. అసెంబ్లీలో తాతా మధుపై సీఎం రేవంత్ ఫైర్!

ఏం పాపం చేశాం? అసెంబ్లీ ఎదుట దుశ్శాసన పర్వం.. సునీత కంటతడి, సబిత ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ వద్ద హైడ్రామా.. నిరసనలు, ప్లకార్డులతో.. కేటీఆర్‌కు గాయాలు- సునీత కన్నీరు

హైదరాబాద్‌లో ఘోరం.. మంటల్లో దగ్దమైన కారు, ఓ వ్యక్తి సజీవదహనం

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. తెలంగాణలో భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు అలర్ట్

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

Big Stories

Advertisement
×