E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు

డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు
Advertisement

Groundwater Crisis: స్వేచ్ఛ బ్యూరో: నీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వేసవి మధ్య దశలో భానుడి ప్రతాపం చూపుతున్నాడు. దీంతో భూగర్భజలాలు సైతం క్రమంగా పడిపోతున్నాయి జిల్లాలో భూగర్భ జల మట్టం గత సంవత్సరం మార్చిలో సగటున 5.89 మీటర్లు ఉండగా ప్రస్తుతం 5.17 మీటర్లు ఉంది. మార్చి మాసానికి సంబంధించిన భూగర్భ జలాల గణాంకాలను ఆ శాఖ ఇటీవల విడుదల చేసింది.నీటిమట్టలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు పొదుపు చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భూగర్భ జల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

వరి,ఇతర కూరగాయల సాగు అవసరాలకు

జిల్లాలో వరి సాగు అధికంగా ఉంది మరో పది రోజులలో ఆ పంట కోతకి రానున్నది. దీంతో నీటి వినియోగం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఇతర కూరగాయల, ఉద్యానవన పంటలు,బోర్లు, బావుల కింద ఉచిత విద్యుత్ ద్వారా మోటర్లు వినియోగం ఉంది.ప్రస్తుత రబీలో వేరుశనగ కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. వాటికి నీరు పెట్టేందుకు రైతులు ఆటోమేటిక్ స్టార్టర్ ఏర్పాటు చేయడంతో కరెంటు ఉన్నంతసేపు బోర్లు నడుస్తున్నాయి. దీనివల్ల అవసరాన్ని కంటే వృధా అవుతున్న నీరు ఎక్కువ జరుగుతోంది. మరోవైపు రానున్న ఖరీఫ్ లో పంటల సాగుకు ప్రస్తుత వేసవిలో బోర్ల తవ్వకాల జోరు ఊపందుకోంది.

Advertisement

Also Read: అశ్వారావుపేటకు గ్రీన్ ఫీల్డ్ సెగ.. కళ తప్పిన వ్యాపార రాజధాని..!

పొదుపు పాటించకుంటే ఇక్కట్లే..

భూగర్భ జల మట్టాలు పడిపోతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. నీటి పొదుపుపై ప్రజలకి చైతన్యవంతులని చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎండలు మరింత ముదిరితే నీటి మట్టాలు మరింత లోతుకు పడిపోతాయి. తాగునీటికి సైతం ఇక్కట్లు తప్పవు. ఇంకుడు గుంతల ఏర్పాటుతో పాటు నీటి వృధాను అరికట్టడం ప్రధానం.

అవగాహన కల్పిస్తున్నాం: భూగర్భ జల శాఖ రాజేష్

Advertisement

నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదే విషయమై అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం.భూగర్భ జలాలను గరిష్టంగా వాడకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైనప్పుడే వ్యవసాయ అవసరాలకు వినియోగించాలని రైతులకు సూచిస్తున్నాం. సాదారణంగా జిల్లాలో సాధారణ భూగర్భ జలాల నీటి మట్టాలు మీటర్లలో 5.89 గత సంవత్సరం ఉండగా ప్రస్తుతం 5.17 గా నమోదయింది.

Also Read: కేసీఆర్ వారసత్వం వద్దు.. కవిత నయా రాజకీయం వెనుక అసలు ప్లాన్ ఇదే..!

2025. 2026
అలంపూర్. 7.37 6.96
ధరూర్ 4.70 4.73
గద్వాల్ 3.69 4.73
గట్టు 8.07 6.82
ఐజ .31 4.58
ఇటిక్యాల 4.49 3.94
కేకే దొడ్డి 11.84 9.71
మల్దకల్ 3.51 2.81
మనోపాడు 3.59 3.71
రాజోలి 3.74 4.0
ఉండవల్లి 12.85 10.45
వడ్డేపల్లి. 3.89 2.97
ఎర్రవల్లి 3.54 3.10

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×