E-Paper
Advertisement

Guidelines GO: ‘ఇది దేశ చరిత్రలోనే ప్రథమం’

Guidelines GO: ‘ఇది దేశ చరిత్రలోనే ప్రథమం’
Advertisement

Minister Ponnam Prabhakar Comments: గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డా. బీఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావ్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు ఉన్నారు. గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియాచెల్లింపునకు ప్రభుత్వం రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయించిందని, జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Also Read: ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. అప్లై చేసుకున్నారా?

Advertisement

అనంతరం టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందంటూ ఆయన అభినందనలు తెలిపారు. మంత్రి పొన్నం చొరవ తీసుకుని గల్ఫ్ సంక్షేమ జీవోల విడుదలకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు అనేది ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశ చరిత్రలోనే ప్రథమం అని ఆయన ప్రభుత్వాన్ని కొనియాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మృతి చెందిన గల్ఫ్ కార్మికుల వారసులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు చేరుకోవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి గల్ఫ్ సంఘాలు, గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జేఏసీ పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Also Read: రాష్ట్ర ప‌ర్యాట‌కంపై అమెరికాలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌చారం.. ప్రశంసల పరంపర

టీపీసీసీ ఎన్నారై సెల్ బృందం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ – ఎన్నారై) ప్రభుత్వ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు, జీఏడీ ఎన్నారై ప్రొటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ డా. ఎస్. హరీష్, ఎన్నారై అధికారులు బీబీఆర్ కార్తీక్, ఇ. చిట్టిబాబు, రూపలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి అభినందనలు తెలిపారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×