UP Rains: ఉత్తర్ ప్రదేశాన్ని రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కురిసిన వర్షానికి ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ప్రయాగ్ రాజ్ లోనే 21 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలియజేశారు. 24 గంటల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
అకస్మిక వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు యూపీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్యను.. ప్రాంతాల వారీగా ప్రకటించాయి. ప్రయాగ్ రాజ్ లో అత్యధికంగా 21 మంది చనిపోగా.. భదోహిలో 18 మంది, మీర్జాపూర్ లో 15 మంది, ఫతేపూర్ లో మరో 10మంది ప్రాణాలు విడిచారు. అలాగే ఉన్నావ్, బదౌన్ లో ఆరుగురు, ప్రతాప్ గఢ్, బరేలీలో నలుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. అటు సీతాపూర్, రాయ్ బరేలి, చందౌలీలో ఇద్దరు చొప్పున తుదిశ్వాస విడిచినట్లు అధికారుల స్ఫష్టం చేశారు.
Also Read: ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో SIR.. ఆ తేదీల్లో ఇంటింటి సర్వే
యూపీలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయినట్లు అధికారులు, ప్రజలు చెబుతున్నారు. యూపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాలను దట్టమైన మేఘాలు కమ్మేశాయని తెలియజేస్తున్నారు. అనంతరం అతివేగంగా వీచిన గాలులు ధాటికి రహదారి పక్కన ఉన్న హోర్డింగ్స్, రేకుల షెడ్లు ఎగిరిపోయాయని పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం గాలి ధాటికి వేళ్లతో సహా బయటకు వచ్చి కుప్పకూలాయని వివరిస్తున్నారు. కుప్పకూలిన చెట్ల కారణంగా చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వాహనాలపై చెట్లు పడి నుజ్జు నుజ్జు కూడా అయ్యాయని, తుఫాను ధాటికి పలువురి ఇళ్లు సైతం దెబ్బతిన్నాయని వివరించారు.
Also Read: BSNL ధమాకా ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. 300 రోజులు పండగే!