BigTV English
Advertisement

Telangana:భయం భయంగా భద్రాచలం..గోదారమ్మ ఉగ్రరూపం

Telangana:భయం భయంగా భద్రాచలం..గోదారమ్మ ఉగ్రరూపం

High level flood water crossed 50 feet Bhadrachalam


ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది.50 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం చుట్టుపక్కల గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మైకుల ద్వారా ముంపు ముప్పు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. వరద నీటి మట్టం 60 అడుగులకు చేరుకునే ప్రమాదం ఉండటంతో దాదాపు పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుకుంటోంది.

గోదావరి ఉగ్రరూపం


గోదావరి ఉపనదుల వరద నీరు కూడా గోదావరికి వచ్చి చేరడంతో గోదావరి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదులనుంచి వచ్చే వరద నీరు గోదావరిలో కలుస్తోంది. మంగళవారం రాత్రికి 53 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయవలసి వస్తుంది.గతంలో 1986 సంవత్సరంలో 70 అడుగుల స్థాయిలో భద్రాచలం వద్ద నీటి మట్టం నమోదయింది. తీరం వెంట గట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తుంగభద్ర కూడా తోడయితే..

తుంగభద్రకు కూడా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తక తప్పదని అధికారులు అంటున్నారు. ఇక తుంగభద్ర నీరు కూడా కలిస్తే గోదావరి నీటి మట్టం గంటగంటకూ ప్రమాద కర స్థాయికి చేరుకోవచ్చు. దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాలకే వరద ముప్పు తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దుమ్ముగూడెం పరిధిలో పదమూడు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటాయని ఆ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. 2023 సంవత్సరంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 73 గా నమోదయింది. అదే జరిగితే భద్రాచలం పరిధిలోని వందకు పైగా గ్రామాలు మునిగిపోతాయని అంటున్నారు. నీటి పారుదల అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటి పరిస్థితి పట్ల అప్రమత్తం అవుతున్నారు. ఏ ఏ ప్రాంతానికి అధికంగా వరద ముప్పు పొంచి వుందో ఆ ప్రాంతాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Related News

Joint Collector: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు, ఇక ఎఫ్ఎస్ఓలుగా..?

Sri Chaitanya School: శేరిలింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ సీజ్.. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు..!

Telangana Liquor Shop: మద్యం షాపులకు భారీగా ధరఖాస్తులు.. అత్యధికంగా ఆ జిల్లాలోనే

Yadadri Bhuvanagiri: కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం.. సక్సెస్ అయిన ఉద్యోగవాణి

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. 34 శాతం ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

Hyderabad News: 8 ఏళ్ల పోరాటం.. హైడ్రా సాకారం, ఆనందంలో ప్లాట్ యజమానులు

Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. పోటీలో 58 మంది అభ్యర్థులు

Big Stories

×