E-Paper
Advertisement

Kumuram Bheem District : శవం ఎముకలు పీకి మరీ క్షుద్రపూజలు.. కుమ్రంబీమ్ జిల్లాలో షాకింగ్ ఘటన

Kumuram Bheem District : శవం ఎముకలు పీకి మరీ క్షుద్రపూజలు.. కుమ్రంబీమ్ జిల్లాలో షాకింగ్ ఘటన

Kumuram Bheem District : తెలతెలవారు జామున అలా రోడ్డుపైకి వచ్చి, రోడ్డు మీద నడుస్తున్న వారికి గుండెలు గుబెలుమనే దృశ్యం కనిపించింది. నడిరోడ్డుపై మనుషుల ఎముకలు పెట్టి, చుట్టూ ముగ్గులు వేసి ఉండడం చూసి హడలిపోయారు. ఈ ఘటన కుమరం భీమ్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో అలజడి రేపింది. నిన్న అమావాస్య కావడంతో అర్థరాత్రి క్షుద్రపూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

పొద్దున్నే ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్త వ్యాపించింది. చుట్టు పక్కల ఊర్లల్లో సైతం ఆ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటి ఘటన ఏంటంటే.. కుమరం భీమ్ జిల్లాలోని బెజ్జూరు మండలం ఏటిగూడలో నడిరోడ్డుపై క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పూజలు అంటే మామూలుగా కాదు.. మనిషి ఎముకలను నడిరోడ్డుపై పెట్టి మరీ పూజలు చేశారు.

రెండు వారాల క్రితం చనిపోయిన ఓ వ్యక్తిని ఏటిగూడలోని ఓ స్థలంలో పాతిపెట్టారు. ఆ సమాధిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు.. కుళ్లిపోయిన స్థితిలోని శవం నుంచి ఎముకలను వేరు చేసి నడిరోడ్డుపై క్షుద్రపూజలు చేశారు. ఐదుగురు వ్యక్తులు కలిసి అర్థరాత్రి వేళ సమాధిని తవ్వినట్లుగా కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. నిన్న అమావాస్య కావడంతో అతీంద్రీయ శక్తులు, మాయలు కావాలని కొందరు ఇలాంటి ముఢకార్యక్రమాలకు పాల్పడుతుంటారు. మరికొందరు.. బాణామతి, చాతబండి వంటి మూఢ నమ్మకాలతో ఇలాంటి పిచ్చ పనులకు పాల్పడుతుంటారని చెబుతున్నారు.

పద్నాలుగు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి ఎముకల్ని తవ్వి మరీ ఈ క్షుద్రపూజలకు పాల్పడడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు. ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారో గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read : చిట్ ఫండ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన మోసగాడు.. కేసీఆర్ కు బంధువా?

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×