E-Paper
Advertisement

Kumuram Bheem District : శవం ఎముకలు పీకి మరీ క్షుద్రపూజలు.. కుమ్రంబీమ్ జిల్లాలో షాకింగ్ ఘటన

Kumuram Bheem District : శవం ఎముకలు పీకి మరీ క్షుద్రపూజలు.. కుమ్రంబీమ్ జిల్లాలో షాకింగ్ ఘటన
Advertisement

Kumuram Bheem District : తెలతెలవారు జామున అలా రోడ్డుపైకి వచ్చి, రోడ్డు మీద నడుస్తున్న వారికి గుండెలు గుబెలుమనే దృశ్యం కనిపించింది. నడిరోడ్డుపై మనుషుల ఎముకలు పెట్టి, చుట్టూ ముగ్గులు వేసి ఉండడం చూసి హడలిపోయారు. ఈ ఘటన కుమరం భీమ్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో అలజడి రేపింది. నిన్న అమావాస్య కావడంతో అర్థరాత్రి క్షుద్రపూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

పొద్దున్నే ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్త వ్యాపించింది. చుట్టు పక్కల ఊర్లల్లో సైతం ఆ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటి ఘటన ఏంటంటే.. కుమరం భీమ్ జిల్లాలోని బెజ్జూరు మండలం ఏటిగూడలో నడిరోడ్డుపై క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పూజలు అంటే మామూలుగా కాదు.. మనిషి ఎముకలను నడిరోడ్డుపై పెట్టి మరీ పూజలు చేశారు.

Advertisement

రెండు వారాల క్రితం చనిపోయిన ఓ వ్యక్తిని ఏటిగూడలోని ఓ స్థలంలో పాతిపెట్టారు. ఆ సమాధిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు.. కుళ్లిపోయిన స్థితిలోని శవం నుంచి ఎముకలను వేరు చేసి నడిరోడ్డుపై క్షుద్రపూజలు చేశారు. ఐదుగురు వ్యక్తులు కలిసి అర్థరాత్రి వేళ సమాధిని తవ్వినట్లుగా కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. నిన్న అమావాస్య కావడంతో అతీంద్రీయ శక్తులు, మాయలు కావాలని కొందరు ఇలాంటి ముఢకార్యక్రమాలకు పాల్పడుతుంటారు. మరికొందరు.. బాణామతి, చాతబండి వంటి మూఢ నమ్మకాలతో ఇలాంటి పిచ్చ పనులకు పాల్పడుతుంటారని చెబుతున్నారు.

పద్నాలుగు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి ఎముకల్ని తవ్వి మరీ ఈ క్షుద్రపూజలకు పాల్పడడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు. ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారో గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Also Read : చిట్ ఫండ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన మోసగాడు.. కేసీఆర్ కు బంధువా?

Related News

సుప్రీం కోర్టులో హైడ్రాకు చుక్కెదురు.. 40 ఎకరాల భూమి కేసు డిస్మిస్!

సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ!

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌.. ప్రిన్స్ రహీమ్ అగాఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ, గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

రౌడీషీటర్ నయీమ్‌ దారుణ హత్య.. హైదరాబాద్‌లో ఓ వైన్ షాపు ముందు ఘటన, సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, అసలు ఏం జరిగింది?

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

Big Stories

Advertisement
×