E-Paper
Advertisement

Huzurabad Municipal Election: ప్రజల అవసరాలే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది : కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్!

Huzurabad Municipal Election: ప్రజల అవసరాలే ధ్యేయంగా  ప్రభుత్వం పనిచేస్తోంది : కాంగ్రెస్ నేత  వొడితల ప్రణవ్!

Huzurabad Municipal Election:  హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ (Vodithala Pranav) నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రచార పర్వంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్నాయి. పట్టణంలోని 3, 4 మరియు 18వ వార్డుల్లో నిర్వహించిన ముమ్మర ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ప్రతీ గడపకూ చేరుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వొడితల ప్రణవ్ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణం ఎదుర్కొన్న సమస్యలను ఎండగడుతూనే, గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజల కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు.

Also Read: Khammam Police: ఖమ్మంలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. ర్యాలీలు, ధర్నాలు నిషేధం.. సీపీ సునీల్ దత్ హెచ్చరిక!

ప్రజల అవసరాలే ధ్యేయం

ప్రచారంలో భాగంగా ప్రణవ్ మాట్లాడుతూ ప్రజల అవసరాలే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. “గత పదేళ్లలో జరగని పనులు కేవలం రెండేళ్లలోనే చేసి చూపాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ, భరోసా, బోనస్, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని ప్రజలకు వివరించారు.

కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులను అభివృద్ధి చేసుకునేందుకు మరింత అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంలో పని చేసే అధికారులను అధికారికంగా కలవాలంటే అధికార పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సూచించారు. ప్రజలు మెరుగైన పాలన కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్తున్న తరుణంలో మహిళలు, వృద్ధులు ప్రణవ్‌కు బ్రహ్మరథం పడుతూ, ఈసారి ఎన్నికల్లో హస్తం గుర్తుకే తమ ఓటు అని స్పష్టమైన మద్దతు తెలుపుతున్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటే మరింత బాధ్యతాయుతంగా పనిచేసి హుజూరాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Also Read:Mahabubabad Municipal: ఆ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా నేనా? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×